English | Telugu

L2 ఎంపురాన్ కి సంబంధించిన అసలు నిజం బయటపడింది..ఎంత డబ్బు పెట్టారో తెలుసా!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో తెరకెక్కిన 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan)మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీకి ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయాన్నీ చిత్ర నిర్మాతలు ఎక్కడా వెల్లడి చెయ్యలేదు.

కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎంపురాన్ బడ్జెట్ ని నిర్మాతలు అధికారకంగా వెల్లడి చేసారు. మలయాళ సినీ ఇండస్ట్రీ లోనే ఫస్ట్ టైం 175 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెప్పుకొచ్చారు. మలయాళ చిత్ర సీమలో మార్చి నెలలో పదిహేను సినిమాలు విడుదలవ్వగా ఎంపురాన్ మాత్రమే విజయాన్ని సాధించిందని, వసూళ్ల పరంగాను 262 కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసి మలయాళ చిత్ర సీమలోనే హయ్యస్ట్ గ్రాసర్ సాధించిన మూవీగా కూడా నిలిచిందని చెప్పారు. కేరళ చలన చిత్ర నిర్మాతల సంఘం కూడా ఈ విషయాన్నీ వెల్లడి చేసింది.

లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్ ని గోకులం గోపాలన్, ఆంథోనీ పెరంబవూర్, సుభాస్కరన్ నిర్మించారు. మంజు వారియర్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంతో పాటు ఒక కీలక పాత్ర చెయ్యగా, ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి వేదికగా జియో హాట్ స్టార్(Jio Hot star)లో స్ట్రీమింగ్ అవుతుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.